*బీసీ ఉద్యమంలో యువకులు కీలక పాత్ర పోషించాలి*....
*బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి
బిజినపల్లి, మే 31 (మనఊరు ప్రతినిధి): నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో శనివారం రోజున బీసీ జన చైతన్య వేదిక నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి చేసే దీక్షకు మద్దతుగా బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక యుగంలో కూడా టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన పటికి యువత బీసీ సమస్యల పైన పోరాడటానికి రావడానికి భయపడవద్దని ఆయా పార్టీల జెండాలు వదిలి బీసీ జెండా పట్టి రాజ్యాంగబద్ధంగా రావలసిన మన ఫలాలు సాధించుకునే దిశగా పని చేయాలని బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలలో పని చేస్తున్నటువంటి బీసీలు, యువత అందరూ కలిసి వచ్చి 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలయ్యే విధంగా పోరాటాలు ఉధృతం చేయాలని అన్నారు. ఈ రిలే దీక్షలో పాల్గొన్న సీనియర్ నాయకులు బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, బీసీ జేఏసీ సంజీవ గౌడు, పూలే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పచ్చిపాల సుబ్బయ్య, వడ్డెర వడ్డెర కుల రాష్ట్ర నాయకులు వెంకటస్వామి, బిసిటిఏ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్, మండల అధ్యక్షులు సత్యగిల సాగర్, వివిధ రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, మండల నాయకులు రాజేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.