పూలే విగ్రహ పునః ప్రతిష్టపానకు రూ18 లక్షల బడ్జెట్ కేటాయించాలి
బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్
జడ్చర్ల రూరల్, జూన్ 23 (మనఊరు ప్రతినిధి) : పూలే విగ్రహ పునః ప్రతిష్టపాన కు 18 లక్షల బడ్జెట్ కేటాయించాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ తెలిపారు సోమవారం జడ్చర్ల పట్టణంలోని ప్రజావాణి కార్యక్రమంలో జడ్చర్ల తహసిల్దార్ నర్సింగ్ రావు కు మెమోరాండం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ జడ్చర్ల పట్టణం లోని సిగ్నల్ గడ్డ ప్రాంతంలో ఉన్న ఇందిరగాంధీ, నెహ్రు, శ్రీకాంతా చారి, అంబేద్కర్, విగ్రహలతో పాటు పైలాన్ దిమ్మె ను తరలించి ఇతర ప్రదేశంలో పునః స్థాపన చేయడానికి లక్షల రూపాయలను కేటాయించిన జాతీయ రహదారుల శాఖ అధికారులు పూలే విగ్రహా తరలింపు, పునః స్థాపన కు కేవలం 61,142రూపాయలు కేటాయించి, మహనీయుని అవమానపరిచి బీసీల మనో భావాలను భంగపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. సమసమాజ నిర్మాణం కోసం, అణగారిన ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగించి, అక్షర జ్యోతి వెలిగించిన మహనీయులు మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహ తరలింపు పునః స్తాపనకు కేటాయించి న బడ్జెట్ పై సంబంధిత అధికారులు పునరాలోచించి 18 లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించి సమచిత స్థానంలో పూలే విగ్రహాన్ని ఆవిష్కరించాలని, కోరారు, లేని యెడల, బీసీ జాగృతి సేన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో రజక సంఘం జాతీయ అధ్యక్షులు, నడిమింటి శ్రీనివాస్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడిత్య రమేష్ నాయక్, ఫకీర్ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఫకీర్ జహంగీర్ పాషా, బీసీ జాగృతి సేన మండల అధ్యక్షులు గొడుగు నర్సిములు, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి లింగం పేట్ శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్, మండల ప్రచార కార్యదర్శి రాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మండల సహాయ కార్యదర్శి చెన్నయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.