జడ్చర్లలో షూటింగ్ సందడి
జడ్చర్ల, ఆగస్టు 22 (మనఊరు ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని రంగనాయకస్వామి గుట్టపై శుక్రవారం 'అ వంతిక-2' షూటింగ్ సందడి మొదలయ్యింది. కార్యక్రమానికి మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజర య్యారు. హీరో, దర్శకుడు శ్రీరాజభల్లా, హీరోయిన్ గీతాంజలిలతో కలిసి రంగనాయకస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆలయం ముందు ముహూర్తం షాట్కు మాజీ మంత్రి క్లాప్ కొట్టి షూటిం గన్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో షూటింగ్ స్పాట్లు అనేకం ఉన్నాయన్నారు. అవం తిక చిత్రబృందం గతంలోనూ ఇక్కడ సినిమా షూటింగ్ చేసిందని తెలి పారు. హీరో, హీరోయిన్లు, జడ్చర్ల వాస్తవ్యుడు, క్రియేటివ్ డైరెక్టర్ ఫణి రాజ్ గౌడ్లు మాట్లాడుతూ కామెడీ హర్రర్ జోనర్ సినిమా ఉంటుం దని తెలిపారు. జడ్చర్ల కళాకారులను ప్రోత్సహించేందుకు త్వరలోనే ఆ డిషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంపికైన వారికి తమ సిని మాలో నటించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటి అనురాధచౌదరి, కెమెరామెన్ రమేశ్, మ్యూజిక్ డైరెక్టర్ రవి వర్మ, నటులు దేవరాజ్, కార్తికేయ, రమణాచార్యులు పాల్గొన్నారు. సిని మా బృందానికి శ్రీరంగనాయకస్వామి దేవాలయ పరిరక్షణ కమిటీ అ ధ్యక్షుడు కాల్వ రాంరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.