ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ
ఇళ్ల కమిటీ సభ్యులు పెద్ది బాలక్రిష్ణ
జడ్చర్ల రూరల్, జూన్ 23 (మనఊరు ప్రతినిధి): రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదేశాల మేరకు నాల్గవ వార్డు ఇళ్ల కమిటీ సభ్యులు పెద్ది బాలక్రిష్ణ భూమి పూజ చేశారు సోమవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 4 వ వార్డు మాధవరావు కాంపౌండ్ లో లబ్ధిదారులు వంగూరి రాజు యాదవ్, స్వాతి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి, ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి మార్కింగ్ చేశారు నిరుపేదలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు. సొంత ఇల్లు లేని పేదలందరికీ గృహ వసతి కల్పించడం సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు. లబ్ధిదారులు తప్పనిసరిగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారై ఉండాలని సూచించారు. కుటుంబానికి సొంత ఇల్లు లేనివారికి గుడిసెలలో తాత్కాలిక ఇళ్లలో నివసించే వారికి ప్రాధాన్యత ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుక్క వెంకటేశం 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు ఆవుల రాఘవేందర్, కాకనూరి మధుసూదన్ రెడ్డి, వార్డు ఆఫీసర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.