9న జిల్లా కేంద్రంలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం...

 *9న జిల్లా కేంద్రంలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం...*

నాగర్ కర్నూలు, జూన్ 1 (మనఊరు ప్రతినిధి): జిల్లా ఆందత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ, రామకృష్ణ టాకీస్ రోడ్డు లోని శోభ ఆప్టికల్ లో ఈ నెల 9న సోమవారం నాడు ఉదయం 9గంటలకు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ ఆప్తాలమిక్ అధికారి బి.శివారెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి, క్యాటరాక్ట్ పోరగల వారినీ ప్రత్యేక అంబులెన్స్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రి ఎనుగొండకు పంపించి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనునట్లు తెలిపారు. రోగులకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా రక్త పరీక్షలు, సాధారణ పరీక్షలు, ప్రతిరోజు నిర్వహిస్తారని తెలిపారు. శిబిరానికి వచ్చే ముందు ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, లేదా రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీని వెంట తెచ్చుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440454284, 8106333324 నెంబరులను సంప్రదించాలని కోరారు.

Previous Post Next Post