*విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి*
*ముగిసిన వేసవి శిక్షణా శిభిరం*
బిజినపల్లి, జూన్ 1 (మనఊరు ప్రతినిధి): విద్యార్థులు ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా పోటీ తత్త్వాన్ని అలవార్చు కోవాలని నాయకులు హెచ్. బసవలింగం, ఏ. చంద్రశేఖర్ లు తెలిపారు. పాలెం గ్రామంలోని శ్రీ టి.ఎస్.ఏం హైస్కూల్ లో గత 29 రోజులుగా విద్యార్థులకు 1991-1996 పూర్వవిద్యార్థులు నిర్వహిస్తున్న చిత్రలేఖనం, భారతీయ సంస్కృతి, సంప్రదాయలు కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందచేశారు. శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు వేసవి శిబిరం దృపపత్రాలు అందచేశారు. కార్యక్రమానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, తిరుపతయ్య, చంద్రశేఖర్, మధుసూదన్, బుచ్చయ్య, ప్రమోద్ కుమార్, జగత్ రెడ్డి, రాములు, జి.నర్సింహారెడ్డి, ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.