లోన్ బీమా తో మహిళా సంఘాలకు ధీమా

 లోన్ బీమా తో మహిళా సంఘాలకు ధీమా 

-స్త్రీ నిధి మేనేజర్ పి.విక్రమ్ కుమార్ 


బిజినేపల్లి, జూన్ 19 (మనఊరు ప్రతినిధి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న లోన్ బీమా, ప్రమాద భీమా పథకాలు స్వయం సహాయక సంఘ సభ్యులకు ధీమాను కల్పిస్తున్నాయని నాగర్ కర్నూలు స్త్రీనిది మేనేజర్ పి.విక్రమ్ కుమార్ అన్నారు. గురువారం బిజినేపల్లి మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో మహిళా సంఘ సభ్యులతో భీమా పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల లోని సభ్యులు స్త్రీనిది, బ్యాంక్ లింకేజ్ రుణం పొంది సహజంగా మరణించినట్లయితే ఆ రుణం మరణించిన సభ్యురాలు కుటుంబానికి, సంఘానికి భారంగా మారకుండా బీమా సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉండి ప్రమాదవశాత్తు మరణించిన సభ్యురాలికి గరిష్టంగా రూ 10 లక్షల వరకు భీమాను కల్పిస్తుందని అన్నారు. లోన్ బీమా ప్రమాద బీమా పథకాలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి స్త్రీనిది ద్వారా బీమా మొత్తం అందజేస్తుందని తెలిపారు. అనంతరం పలు సంఘాలలోని సభ్యులకు జీవనోపాధి రుణాలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో వివోఏ రామ్ చందర్, పలు మహిళా సంఘాల లీడర్లు, సభ్యులు పాల్గొన్నారు.

Previous Post Next Post