* నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తాం*
*షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"*
*నియోజకవర్గ వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం 23 వేల దరఖాస్తులు*
*అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు చిత్తశుద్ధితో ఇవ్వాలి*
*షాద్ నగర్ నియోజకవర్గ పాలసీతో ఎమ్మెల్యే సమీక్ష*
*హాజరైన షాద్ నగర్ ఆర్డీవో ఎన్ ఆర్ సరిత తదితరులు తహాసిల్దార్లు*
*రేషన్ షాపులో బియ్యం తూకం తక్కువ వేస్తే చర్యలు *
షాద్ నగర్, జూన్ 27 (మనఊరు ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుందని అర్హులైన నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు చిత్తశుద్ధితో అందజేసేందుకు ప్రభుత్వ పనితీరు సిద్ధంగా ఉండాలని షాద్ నగర్ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షాద్ నగర్ ఆర్డీవో ఎన్ ఆర్ సరిత నియోజకవర్గంలోని కొత్తూరు, ఫరూక్ నగర్, కేశంపేట, నందిగామ, జిల్లేడు చౌదరి గూడెం, కొందుర్గు మండలాల అధికారులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలు రెండు మున్సిపాలిటీలకు కలిపి 23 వేల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయని ఎమ్మెల్యే వివరించారు. ఇందులో కొందుర్గు మండలం 2300 రేషన్ కార్డులు దరఖాస్తులు రాగా, నందిగామ 2800, కొత్తూరు 1400, జిల్లేడు చౌదరిగూడ 4699, కొత్తూరు 1413, కేశంపేట 2,663, ఫరూక్ నగర్ 3,385, షాద్ నగర్ టౌన్ 3902 దరఖాస్తులు అధికార యంత్రాంగానికి వచ్చినట్లు తెలిపారు. వీటిని పరిశీలించి చిత్తశుద్ధితో ప్రతి నిరుపేదకు రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే వరకు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా గ్రామాల్లో నిరుపేదలకు గురిచేసిందని గుర్తు చేశారు. అదేవిధంగా గ్రామపంచాయతీల కోసం గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ప్రత్యేక గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి వాటికి ఎలాంటి ఆదాయం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొత్త గ్రామపంచాయతీలకు ఆదాయ వనరులను సమకూర్చే బాధ్యత ప్రభుత్వాన్నిదేనని అన్నారు.
*రేషన్ షాపులో బియ్యం తూకం తక్కువ వేస్తే చర్యలు*
సన్న బియ్యాన్ని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడంతో పేద ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారని అయితే స్టాక్ పాయింట్ల వద్ద అదే విధంగా ఉంది రేషన్ షాపుల్లో కొందరు సన్నబియ్యాన్ని తక్కువ తూకం వేస్తున్నారని సంచులతో కలిపి తూకం వేస్తూ ఉండటంతో దాదాపు సంచికి రెండు కిలోల బియ్యం తక్కువగా ఉన్నాయి తూకం వస్తున్నాయని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని మీడియాకు ఎమ్మెల్యే శంకర్ వివరించారు. స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న సమస్యను పరిశీలించాలని, అదేవిధంగా డీలర్లు కూడా ఎవరైనా తక్కువ తూకం బియ్యం వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు సరఫరా చేసే బియ్యం విషయంలో 100 గ్రాములు తక్కువైన ఊరుకోకూడదని ప్రజలకు సూచించారు. చౌకదార బియ్యం పంపిణీ ప్రజల హక్కు అని వాటిని పొందేందుకు సర్వహక్కులు ప్రజలకు ఉన్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. ఎవరైనా అలాంటి పనులకు వస్తే మానుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ గౌడ్ అంబటి ప్రభాకర్ దేవేందర్, ఎలికట్ట మాజీ ఎంపిటిసి శ్రీశైలం, లింగారెడ్డి గూడ అశోక్ తదితరులు పాల్గొన్నారు.