ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అక్షరాభ్యాసం, విద్యా సామాగ్రి పంపిణీ

 *ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అక్షరాభ్యాసం, విద్యా సామాగ్రి పంపిణీ*

శనేశ్వర దేవాలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథ శాస్త్రి






నాగర్ కర్నూల్, జూన్ 13 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని వినోబా నగర్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (సుబ్రహ్మణ్యం దేవాలయం) లో శుక్రవారం నాడు పాఠశాల విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసంను శనేశ్వర స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథ శాస్త్రి శాస్త్రోక్తంగా నిర్వహించి,పాఠశాల విద్యార్థులకు 5వెల రూపాయల విలువగల విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈసందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాలు కే. మంజుల మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు దాతృత్వం గల వారు ప్రోత్సహించాలని ఆమె కోరారు.విద్యార్థులకు రూ 5 వేల విలువ గల పుస్తకాలు,నోటు బుక్కులు, పెన్నులు,పలకలు,క్రెయన్స్, కంపాక్స్ పెట్టెలు పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ అందచేశారు.ఈ కార్యక్రమంలో టి.ఎం.చిన్నయ్య, మహేశ్వరి దంపతులు,ఉపాధ్యాయులు మంజుల, తల్లిదండ్రులు, మహిళసంఘం సభ్యులు పాల్గొన్నారు.

Previous Post Next Post