సమాజాభివృద్ధికి మూలం విద్య

 *సమాజాభివృద్ధికి మూలం విద్య* 

*విద్యార్థులకు విద్యా సౌభాగ్యం*

*విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి*

 *మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫార్ముల పంపిణీ*


కేశంపేట, జూన్ 13 (మనఊరు ప్రతినిధి): సమాజ అభివృద్ధికి మూలం విద్యేనని నమ్మే ప్రముఖ ప్రజాప్రతినిధి, మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి కేశంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం నిర్వహించిన ప్రత్యేక విద్యా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల శిక్షణా సాధనాలైన పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, స్కూల్ యూనిఫార్ములు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహం నింపింది. పాఠశాల ఆవరణ మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించడంతో, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సిబ్బంది ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాల శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ విద్య ఎవరికి అయినా పునాదని. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విద్యార్థులు ఎక్కువగా వెనుకబడిన తరగతులకు చెందిన వారని ఆమె అన్నారు. వారు బాగుపడాలి అంటే పాఠ్య వనరులు, ప్రోత్సాహం, తగిన శిక్షణ అవసరమని ఆమె అన్నారు. ఈ చిన్నపాటి కృషి వారి భవిష్యత్ నిర్మాణానికి కొంత తోడ్పడాలని నా ఆశ అని ఆమె తెలిపారు. చిన్నారి హక్కు చదువు అని, చదువు వృద్ధికి అడ్డుగా ఉండకూడదు అని పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లోని పరిస్థితులు మెరుగయ్యాయని, ఉపాధ్యాయుల కృషిని గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతిఒక్కరు ఒక అడుగు వేస్తేనే సమాజం ముందుకు సాగుతుందని ఆమె అన్నారు. రాజకీయ నాయకులు కేవలం పదవుల్లో మాత్రమే కాకుండా, పదవికి ముందు మరియు తరువాత కూడా సేవా దృక్పథంతో ఉండాలి అంటూ సమాజ సేవ పట్ల తన అంకితభావాన్ని వ్యక్తపరిచారు.

ఈ కార్యక్రమంలో ఏంఈఓ చంద్ర శేఖర్, ఇంచార్జీ ఎంపిడిఓ కిష్టయ్య, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు విద్యావతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు సీతారామ్, అపర్ణ, స్వప్న, లోకేశ్వరి, మాజీ సర్పంచులు శ్రీధర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాయకులు కర్ణాకర్ రెడ్డి, అనసూయ, ఐసీడీఎస్ సూపర్ వైజర్ దివ్య సింగ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి విద్యావతి, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థుల

తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, విద్యా సంరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు కూడా వారి భావోద్వేగాలను పంచుకుంటూ మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి లను కృతజ్ఞతలతో సత్కరించారు.

Previous Post Next Post