మాదక ద్రవ్యాల అనర్థాలపై అవగాహన ర్యాలీ

 మాదక ద్రవ్యాల అనర్థాలపై అవగాహన ర్యాలీ








జడ్చర్ల రూరల్, జూన్ 26 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని సిగ్నల్ గడ్డ నుంచి అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీ నేతాజీ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నర్సింగ్ రావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం కరోనా వైరస్ కంటే అత్యంత భయంకరమైనదని అన్నారు. డ్రగ్స్ విని యోగం సమాజంలో అతి పెద్ద సమస్యగా మారింద ని, ముఖ్యంగా యువత వాటి బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చెడు స్నేహాల వలన మత్తు పదార్ధాలకు అలవాటు డుతున్న యువత తమ భవిష్యత్ను తామే నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తల్లిదం డ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిశితంగా పరిశీ లిస్తుండాలని కోరారు. అలాగే యువతలో మార్పు తీసుకురావడం ద్వారానే డ్రగ్స్ వాడకాన్ని అరికట్టడం సాధ్యమ వుతుందన్నారు.డ్బబ్ష విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరాలని మంత్రి సీతక్క సూచించారు.

 *మత్తు అతి ప్రమాదకరం: కమిషనర్ లక్ష్మారెడ్డి* 

మారకద్రవ్యాలైన, ఇతర ఏ మత్తు పదార్థాలైనా శరీరానికి హానిని కలిగించడమే కాకుండా పలు నేరాలకు కారణం అవుతాయని జడ్చర్ల కమిషనర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. యుక్త వయసులో, టీనేజీ వయసులో కూడా వీటిని అలవాటు చేయడం వల్ల చిన్నతనంలోనే నేరాలకు పాల్పడి చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండి నేరాలను నిరోధించడంలో తమకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మినాజ్, నాయకులు బాదిమి రవిశంకర్, సిడిపిఓ ఐసిడిఎస్ శోభారాణి, సూపర్వైజర్స్ సుగుణ, సునీత, రాజ్యలక్ష్మి, సావిత్రి, కల్పన, అనసూయ, అనిత, నాగేంద్రమ్మ, అరుణ జ్యోతి, అంజనమ్మ, అంజలి, సంధ్య,ుమాణిక్యమ్మ, భాగ్యమ్మ, లక్ష్మిౙ లిక్కర్, పోలీసులు, టైం జడ్చర్ల, బాదేపల్లి అంగన్వాడి టీచర్స్, విద్యార్థులు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post