ఘనంగా వంశీకృష్ణను సన్మానించిన ఐ.ఎన్.టి.యు.సి తాలూకా కమిటీ

 ఘనంగా వంశీకృష్ణను సన్మానించిన ఐ.ఎన్.టి.యు.సి తాలూకా కమిటీ

అచ్చంపేట, జూన్ 10 (మనఊరు ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను నియమితులైనందుకు ఐ.ఎన్.టి.యు.సి తాలూకా కమిటీ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఐఎన్టియుసి తాలూకా కమిటీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ భవిష్యత్తులో మరిన్ని గొప్ప గొప్ప పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలు అందరికీ పార్టీలో కష్టపడ్డ వాళ్లందరికీ మంచి పదవులు సమయాన్నిబట్టి కచ్చితంగా వస్తుంటాయన్నారు. రాష్ట్ర కమిటీలో డాక్టర్ వంశీకృష్ణకు అవకాశం ఇచ్చినందుకు ఐఎన్టీయూసీ తరుపున పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఆని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా అవకాశం వచ్చినందుకు ఐఎన్టియుసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బల్మూర్ మండల్ ఐఎన్టీయూసీ అధ్యక్షులు చందు నాయక్, టౌన్ ఐఎన్టీయూసీ అధ్యక్షులు గౌస్ పాషా, అచ్చంపేట మండల ఉపాధ్యక్షులు మౌలానా, రాములు, వెంకటేష్, మహేష్ రాజు, రఘు, నగేష్, శ్రీరాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post