డ్యూటీ చాటున సాగు లూటీ లంచం.. !

 *డ్యూటీ చాటున సాగు లూటీ లంచం.. !* 

 *కాపాడండి మహా ప్రభొ.. అంటూ అధికారుల పరుగులు* 

 *మహాప్రభుతో గోడు వెళ్లబోసుకున్న షాద్ నగర్ సబ్ రిజిస్ట్రార్లు* 

 *ఇదేం పద్ధతని తలంటిన మహాప్రభు..?* 

*బదిలీ చేయండి సార్.. వెళ్లిపోతా..*

 *ఇలాంటి వార్తలు మస్తు చూసినం.. మేము మారం అంటున్న షాద్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ సిబ్బంది* 

 *మమ్మల్ని ఎవరు ఎం చేయలేరనీ "ప్రైవేటుల" ధీమా* 

*మా సర్వీసులో ఇలాంటి కథనాలు చాలా చూశాం అంటున్న మొండి ఘటాలు* 

పురుడు పోస్తే లంచం..

బొడ్డు కోస్తే లంచం.. 

అమ్మ పాల కన్నా ముందే పరిచయం ఈ లంచం.. 

బ్రతకడానికి లంచం 

ఎదగడానికి లంచం..

షాద్ నగర్, జూన్ 10 (మనఊరు ప్రతినిధి): అంతరాత్మని తాకట్టు పెట్టేది లంచం.. లంచాలు లేనట్టి మంచి ప్రపంచం.. కావాలన్నా గాని ఇవ్వాలి లంచం.. డ్యూటీ చాటున సాగు లూటీ లంచం.. అభివృద్ధిని నట్టేట ముంచేది లంచం..! లంచం గురించి రచయితలు ఈ సమాజానికి గొప్పగా చెప్పారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కేంద్రంలో సబ్ స్టేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమ వాసుల భాగోతంపై వరుస కథనాలు ప్రసారం అవుతుంటే కాపాడండి మహాప్రభువు అంటూ ఇద్దరు అధికారులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పరుగులు పెట్టారు. స్థానికంగా ప్రజా ప్రతినిధికి పరిచయం ఉన్న వ్యక్తులను వెంట తీసుకొని ఎలాగైనా గట్టు ఎక్కించాలంటూ ఎమ్మెల్యే ముందు మొర పెట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒకరైతే బదిలీ చేయండి వెళ్ళిపోతా అంటూ ప్రాధేయ పడుతున్నట్టు సమాచారం. మీరు పద్ధతిగా ఉంటే మీపై ఎవరు ఎందుకు వార్తలు రాస్తారు..? ప్రజలకు సేవలు అందించడంలో చూసి నడుచుకోవాలి ప్రజలతో మంచిగా మసులుకోవాలి అనవసరమైన ఆశలకు పోతే ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతాయని ముందు మీరు మారండి అంటూ సదరు ప్రజా ప్రతినిధి సున్నితంగా తలంటినట్టు సమాచారం. షాద్ నగర్, ఫరూక్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వ్యవహారంపై కథనాలు వెలువడుతుండడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగుతుంది. ప్రజలు ఈ అక్రమాలను ధృవీకరిస్తున్నారు ప్రతి ఒక్కరూ బాధితులే. ఈ కార్యాలయం గడపలు తొక్కిన వాళ్ళు అందరూ ఇప్పుడు వాస్తవాలను వివరిస్తున్నారు. లంచాలు తీసుకుంటే అక్కడే నిలదీయండి వారి అంతు తేలుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ సభలో సెలవిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబద్దతగా ఉండాలన్నది ఆయన కృత నిశ్చయం. మరి లంచాలు లేనట్టి మంచి సమాజాన్ని స్థానిక అధికారులు ప్రజలకు కొత్తగా పరిచయం చేస్తారా లేదా అన్నది చూడాలి.. ప్రైవేటుతో కాలం నిలదీస్తున్న అధికారులు కార్యాలయంలో పెత్తనం అంతా వాళ్ళదే.. ఉదయం నుండి సాయంత్రం దాకా జరిగే తతంగంలో వీరిది కీలకపాత్ర. ప్రతి డాక్యుమెంట్ కు వచ్చే ప్రతి పైసా సాయంత్రం డాక్యుమెంట్ రైటర్ల వద్ద దర్జాగా వసూలు చేసి స్వామికి మొక్కులు చెల్లించుకున్నట్లు ఉంటుంది ఈ మొండిఘటాల వాలకం..  ఇక వాస్తవంలోకి వెళితే

 *అంతేకదా..!* 

షాద్ నగర్, ఫరూక్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో ప్రభుత్వం తీసుకోచ్చిన కొత్త స్లాట్ విధానం సరిగా అమలు అవుతుందా? 15 నిముషాల్లో రిజిష్ట్రేషన్ దస్తావేజు వాపసు కొనసాగుతుందా? అంటే లెదు అనే చెప్పాలి ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహించిన స్లాట్ విధానాని మన అధికారులు తుంగలో తొక్కుతున్నారు. వీళ్లకీ ఎ దస్తావేజు ఎలా వసూల్ చేయాలో? వాటిపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వం స్లాట్ విధానం అర్ధం ఏమిటో దాని పరమార్థం ఏమిటో వీళ్ళకే తెలియాలి. వీళ్ళ వల్ల ప్రభుత్వానికి చేడ్డ పేరు వస్తున్నది అని తెల్సిన ఎం చేయలేని పరిస్థిదా లెదా ధీమానా..? 

ఈసి ఎంత సమయంలో ఇవ్వాలి? ఒక ఈసికీ ప్రభుత్వం నిర్ణయంచిన ధర ఎంత? ఎంత వసూల్ చేస్తున్నారు..? 

ఒక సిసికీ ధర ఎంత? ఎంత వసూల్ చేస్తున్నారు..? 

స్టాంప్ లు అమ్మకం లేకుండా బయట స్టాంప్ వెండర్లను ఫ్రాకలింగ్ చేయకుండా బయట లైసన్స్ హోల్డర్లని ప్రోత్సహిస్తూ వచ్చిన కస్టమర్లను దండుకుంటూ ఇలా ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకుండా వీళ్ళ స్వంత రేట్లను అమలు చేస్తున్న ఏకైక శాఖ సబ్ రిజిష్టర్ కార్యాలయాలు కాబోలు. ఇంత జరుగుతున్న పై అధికారులు ఎందుకు పట్టించుకోవడం లెదు? ఇప్పటికే అర్ధం అయి ఉంటది ఎంత అవినీతి జరుగుతుందో..? 

 *మేమింతే* 

షాద్ నగర్ -ఫరుఖ్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై రోజుకో కథనం వెలువడుతున్న మేమింతే మేము మారం అంటూ మా దందాలు మాకె అంటూ వ్యక్తి గత ప్రయివేటు సిబ్బంది నియమించుకొని మామూళ్లు యధావిధిగా కొనసాగుతున్నారు. కానీ ఇంత చెప్పినా ఇంత వెలుగులోకి వచ్చినా వీరి మామూళ్ళ పర్వం ఆగట్లేదు మరి.  వీరికి అభయం ఎవరు ఇస్తున్నారు? లేక మమ్మల్ని ఎవరు ఎం చేయలేరన్న ధీమా? లేదా పై అధికారులను జో కొడుతున్నారా? అనే ప్రశ్నలకి అవును అనే సమాధానం వ్యక్తం అవుతున్నది. ఒక స్టాంప్ ల లైసన్స్ ల లీడర్ కానీ లీడర్ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అడుగులకు మడుగులు వత్తె దళారి అప్పుడు గత ప్రభుత్వం నేనే ఇపుడు కూడా నేనే అంటున్నా దళారులు కొందరు మేము చూసుకుంటాము మేము మాట్లాడతాము అంటూ మేకపోతు గాంబిర్యాలను వలుకబోస్తున్నారు. ఎ పార్టీ అధికారంలో ఉంటే కండువా వేసుకోవడం ఏ కండువాకీ ఆ వేషం వేస్తూన్న వారు ఎంత చెబితే అంత అన్నట్టు రాయబారాలకి వెళ్తున్నారు. కోట్లల్లో లక్షల్లో ఉండే ఆస్తుల కొనుగోలు అమ్మకాలు చేసేటపుడు చాలా జాగ్రత్తగా దస్తావేజులు రాయాలి.. అప్పట్లో లైసన్స్ లు ఉన్నపుడు అనుభవo కల్గిన వారు ఉండే కానీ ఇఫుడు లైసన్స్ లేనందున అఆలు రానివారు కూడా దస్తావేజు లేఖర్లు. ఇలా ఒక ఎత్తు వీళ్ళ కోణంలో  ప్రభుత్వం వీళ్ళ లైసన్స్ లు ఒక దశలో పునరుద్దరిస్తే ప్రభుత్వానికి రాబడి మరియు కొనుగోలు దారుడుకి అమ్మకం దారుడుకీ ఒక మంచి వ్యవస్డను కూడా ఏర్పాటు చేసినవారు అవుతారు. ప్రభుత్వం కూడా దస్తావేజుల లేఖర్ల లైసెన్స్ ల కోసం కూడా ఆలోచన చేయాలి అని ప్రజలు అంటున్నారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం అధికార ఎమ్మెల్యే కానీ పై అధికారులు కానీ ఏసీబి వాళ్ళు పట్టించుకొని వీళ్ళపై ఎలాంటి  చర్యలు తీసుకొంటారో అని జనాలు ఎదురు చూస్తున్నారు.

Previous Post Next Post