అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

 అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లేష్ 




మిడ్జిల్, జూన్ 3 (మనఊరు ప్రతినిధి): దశాబ్ద కాలం తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారని కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లేష్ వెల్లడించారు. మంగళవారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరిగిందని ప్రలోభాలకు, పైరవీలకి తావు లేకుండా ఎంపిక జరుగుతుందన్నారు. ఎవరు కూడా అధైర్య పడవద్దని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి, ఎంపిడిఓ గీతంజలికి, మండల పార్టీ అధ్యక్షులు అల్వాల్ రెడ్డికి, ఆయన వెంట ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. జిల్లా నాయకులు సాయిలు, మాజీ సర్పంచ్ శారద వెంకటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యం గౌడ్,మాజీ ఎంపిటిసి గౌస్, బంగారు, ఇందిరమ్మ కమిటీ కన్నకోట మల్లేష్, జాఫర్, అంజమ్మ, మాసయ్య, కామ్రూన్, తదితర నాయకులకు దన్యవాదాలు తెలిపారు.

Previous Post Next Post