నేడు దివ్యాంగులు, వయో వృద్ధులకు శిబిరం

  *నేడు దివ్యాంగులు, వయో వృద్ధులకు శిబిరం*

▪️అలింకో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పరికరాలు అందజేత

బిజెపి పట్టణ అధ్యక్షులు ఎడ్ల అమర్ నాథ్ గౌడ్

జడ్చర్ల రూరల్, జూన్ 3 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉదయం: 9 గంటల నుంచి సాయంత్రం: 5 గంటల వరకు అలింకో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పరికరాలు అందజేయడంతో బిజెపి పట్టణ అధ్యక్షులు ఎడ్ల అమర్ నాథ్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మహబూబ్ నగర్ ఎంపీ డికెన అరుణ సహకారంతో తెలిపారు. మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ మహబూబ్ నగర్ జిల్లా అలింకో ఆర్గనైజేషన్ హైదరాబాద్ దివ్యాంగులు వయో వృద్ధులకు చలన సహాయ పరికరములు/ అవయవ పరికరములు అందించుటకు గుర్తింపు శిబిరములు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ శిబిరంలో శారీరక వికలాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్, చంక కర్రలు, వీల్ చైర్లు, బధిరులకు, వినికిడి యంత్రాలు, అంధులకు చేతి కర్రలు, బుద్ధి మ్నాద్యులకు టిఎల్ఎమ్ కిట్స్ అందజేయ చెప్పారు. దివ్యాంగులు వయోవృద్ధులు జడ్చర్ల దగ్గర మండలాల వారు హాజరు కాగలరు. దివ్యాంగులు శిబిరానికి వచ్చేవారు ఖచ్చితంగా *ఆధార్ కార్డు, యూడిఐడి (యుడిఐడి) కార్డ్, రేషన్ కార్డ్, సదరం సర్టిఫికెట్లు 40 శాతం పైబడి ఉండాలి,* సర్టిఫికెట్ సంవత్సరమునకు 2,70,000 మించకుండా ఉండాలి, వయో వృద్ధులకు సంవత్సర ఆదాయం 1,80,000లకు మించరాదు, *ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి ఖచ్చితంగా రావాలని కోరారు. గమనిక: గత సంవత్సరము అక్టోబర్ 2024లో జరిగిన ఆలింకో క్యాంపు హాజరైన వారు ఈ శిబిరానికి అనర్హులు. అర్హులైన దివ్యాంగులు వయో వృద్ధులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.

Previous Post Next Post