*ముగిసిన వేసవి శిక్షణ సాంస్కృతిక శిబిరం*
నాగర్ కర్నూల్, జూన్ 9 (మనఊరు ప్రతినిధి): సాయి లహరి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెల రోజులుగా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున వేసవి శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. నెల రోజులుగా విద్యార్థులకు కూచిపూడి, భరతనాట్యంతో పాటు ఫోక్ సాంగ్ లపై శిక్షణను అందించారు. ఈ సందర్భంగా సాయి లహరి ఆర్ట్స్ అకాడమీ శిక్షకుడు పోలోజు సత్యం మాట్లాడుతూ జిల్లాలో చాలా సంవత్సరాల నుండి సాయి లహరి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణను అందిస్తున్నామని,సంస్థ తరఫున దేశ, విదేశాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చామని తెలిపారు. సాయి లహరి ఆర్ట్స్ అకాడమీ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.