సోదరుడి రాజకీయ భవితవ్యం కోసం..

 సోదరుడి రాజకీయ భవితవ్యం కోసం...

బిజెపి, బిఆర్ఎస్ లకు ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే 

 

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోదరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతిపక్ష పార్టీల నాయకులు

నవాబుపేట, జూన్ 13 (మనఊరు ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ మండలంలో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను ఖాళీ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత కొంతకాలం క్రితం వరకు ఆయా పార్టీల నుండి నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి ససేమిరా అన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మండలంలో పార్టీని పటిష్టపరిచి తన గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన తన సోదరుడు దుష్యంత్ రెడ్డిని ఈ మండలం నుండి జెడ్పిటిసిగా నిలిపి గెలిపించుకుని జడ్పీ చైర్మన్ గా ఎంపిక చేయించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే శుక్రవారం పార్టీలోకి ప్రతిపక్ష పార్టీల నాయకులను చేర్చుకోవడం ప్రారంభించారు. దీంతో ఇప్పటివరకు పార్టీలో చేరాలని ఉవ్విళ్ళూరుతున్న ప్రతిపక్ష పార్టీల నాయకులకు మార్గం సుగమమైంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి బిఆర్ఎస్ హయాంలో ఆ పార్టీలో చేరి పలు పదవులు అనుభవించిన నాయకులలో కొందరు ఆ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ లో చేరడానికి సంసిద్ధంగా ఉన్నా వారిని పలు కారణాల వల్ల కొంతకాలం క్రితం వరకు ఎమ్మెల్యే పార్టీలో చేర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. శుక్రవారం పార్టీలోకి చేరికలు ప్రారంభించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. పార్టీలో చేరిన వారిలో మాజీ బిజెపి మాజీ మండలాధ్యక్షుడు బాలస్వామితోపాటు బి, కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post