*విస్తరణ ఓకే .. నష్టపరిహారం ఇప్పించండి*
*ఎమ్మెల్యే శంకర్ ను కలుసుకున్న మెయిన్ రోడ్ వ్యాపారస్తులు*
*నష్టపరిహారం గురించి ప్రభుత్వంతో మాట్లాడతానని ఎమ్మెల్యే హామీ*
షాద్ నగర్, జూన్ 14 (మనఊరు ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మెయిన్ రోడ్డు విస్తరణ కార్యక్రమానికి మున్సిపల్ శాఖ శ్రీకారం చుట్టడంతో వ్యాపారస్తులు అందరూ కలిసి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. రోడ్డు విస్తరణలో తమ దుకాణ సముదాయాలు తొలగించడం వల్ల ఎంతో ఆర్థిక నష్టం జరుగుతుందని కొంతమంది ఒకే షట్టర్ ఉన్నవాళ్లు కూడా ఉన్నారని అలాంటివారు పూర్తిగా నష్టపోతారని ప్రభుత్వం నుండి తమకు నష్టపరిహారం ఇప్పించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే శంకర్ ను శనివారం పలువురు వ్యాపారస్తులు స్థానిక క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. వ్యాపారస్తులు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం అదే విధంగా కృషి చేస్తానని తెలిపారు. మెయిన్ రోడ్డు విస్తరణ ఎంతో ముఖ్యమని పెరుగుతున్న జనాభా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని ఇది భవిష్యత్తు తరాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికే మెయిన్ రోడ్డు విస్తరణ లేక ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం ఇతర అసౌకర్యాలు కలుగుతున్నాయని ఈ క్రమంలో అందరూ స్వచ్ఛందంగా సహకరించి విస్తరణకు కృషి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పలపట్ల మోహన్ రావు, గజవాడ నరసింహులు, కోట్ర రఘు, రవి, గోపాల్ చారి నాగిళ్ల ప్రభాకర్ నాగిళ్ల ప్రకాష్ గందె సురేష్ కమ్మదనం సుధాకర్ ప్రవీణ్ పల్నాటి శ్రీనివాస్ నర్సింలు షంషీర్, ఎంసాని శ్రీనివాస్, జి శ్రీనివాస్ తదితర వ్యాపారస్తులతో పాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.