భూ భకాసురుల
భూ దాహానికి
భూదాన్ భూములు హాంఫట్
ఆక్రమణదారుల
ధన దాహానికి హరించుకుపోతున్న భూధాన్ భూములు
ఆక్రమించుకున్న భూముల్లో దర్జాగా అక్రమ దందా
జడ్చర్ల రూరల్, జూన్ 1 (మనఊరు ప్రతినిధి): భూ భకాసురుల ఆగడాలు అక్రమణలకు అంతులేకుండా పోతుంది.ఎక్కడి నుండో ఇక్కడికి ఉపాధి కోసం వచ్చిన వారు ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని, అవసరాలను ఆసరాగా చేసుకుని వారి నుండి ఇనాం భూములను అక్రమంగా కొనుగోలు చేస్తూ ఆ భూముల పక్కనగల భూదాన్ భూములను ఆక్రమించుకుంటూ కొన్న భూములలో, ఆక్రమించుకున్న భూములలో అక్రమ వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు.ఈ భూముల కొనుగోళ్లు, ఆక్రమణల విషయంలో వారు చేస్తున్న ఆగడాలు ఇక్కడి ప్రజలకు విసుగు పుట్టిస్తున్నాయి. వారి అక్రమాలకు ఆక్రమణలకు ఆగడాలకు అంతులేకుండా పోతుండడంతో
ఇప్పుడిప్పుడే ప్రజలు వాటి గురించి పెదవి విప్పి బయటి ప్రపంచానికి తెలుపుతున్నారు. జడ్చర్ల మండల పరిధిలోని గోప్లాపూర్ లో నకిలీ పత్తి విత్తనాల ఉత్పత్తి, విక్రయాల గురించి బయటపడడంతో వారి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూములు కొనుగోలు చేస్తున్న సమయంలో వాటిలో కంపెనీలు ప్రారంభించి ఏర్పాటు చేసి, అందులో స్థానిక యువతకు ప్రజలకు
ఉపాధి కల్పిస్తామని నమ్మపలుకుతూ ఆ తర్వాత దాని ఊసే ఎత్తడం లేదు. దాంతో వారి మోసపోయామని గ్రహిస్తున్న ఆ ప్రాంత ప్రజలు వారి నుండి విముక్తి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే వారి ఆగడాలకు చెక్ పెట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.