సమగ్ర వ్యాధి నిర్ధారణ ఆరోగ్య పరీక్షల శిబిరం

 సమగ్ర వ్యాధి నిర్ధారణ ఆరోగ్య పరీక్షల శిబిరం

ప్రత్యేక శిబిరంలో ఏడు రకాల వ్యాధులకు రక్త పరీక్షలు

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.వి స్వరాజ్యలక్ష్మి 






బిజినపల్లి, జూన్ 6 (మనఊరు ప్రతినిధి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా శుక్రవారం నాడు బిజినపల్లి మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.వి. స్వరాజ్యలక్ష్మి సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని కలిగి ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఆరోగ్య స్థితిని సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలనే ప్రధానమైనది ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈరోజు నుంచి ఉంటామని తెలియజేసారు. ఈరోజు 

ఈఆరోగ్య శిబిరంలో 127 మందికి 7 రకాల విద్యార్థులకు సాధారణ పరీక్షలతో పాటు రక్తపరీక్షలు, రక్తపోటు, మధుమేహం, పరీక్షలతో పాటుగా టీబీ, హిమోగ్లోబిన్, సుఖ వ్యాధులైన హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ -బి, హెపటైటిస్ -సి వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షలు. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమగ్ర ఆరోగ్య పరీక్ష ప్రత్యేక శిబిరాలను కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చేశామని తెలియజేశారు. ఈ పరీక్షల ద్వారా వారి ఆరోగ్యాన్ని తెలుస్తుందని, కావున ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా ప్రజలను ఆమె కోరుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏం. వెంకట్ దాస్, వైద్యాధికారి డాక్టర్ ఎం.శివకుమార్, డాక్టర్ రాజశేఖర్,ఎన్ ఎల్ హెచ్ పి రవళి, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రమేష్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ నరసింహ,ఐ సి టి సి కౌన్సిలర్ శివశంకర్, ఎస్ టి ఎల్ ఎస్ రాజకుమార్, టిబి సూపర్ వైజర్ శ్రీను, హెల్త్ సూపర్‌వైజర్ అశోక్, ల్యాబ్ టెక్నీషియన్ ఆంజనేయులు, మహిళా ఆరోగ్య కార్యకర్త డి. శ్వేత, ఆశ కార్యకర్తలు, పనిచేశారు.

Previous Post Next Post