విద్యా ప్రమాణాలను మెరుగుపరచెందుకు తగు చర్యలు తీసుకోవాలని వినతి
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నిర్వహించిన " ప్రజా సమస్యలపై బి జె పి భరోసా " కార్యక్రమం లో భాగంగా శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారికి సంక్షోభంలో ఉన్న విద్యా వ్యవస్థను మరియు రాష్ట్రంలో దిగజారిన విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి తగు చర్యలు తీసుకోవాలని మెమోరండం అందజేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో 2024 - 25 లో 6-14 సంవత్సరాల వయసుగల మొత్తం 62,05,041 మంది పిల్లలలో దాదాపు 25,10,527 (40.46%) మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉండగా ప్రైవేట్ పాఠశాలలో 36, 94,514 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల నిర్వహణపై చట్టబద్ధ నియంత్రణ అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ విద్యాశాఖ మరియు SCERT సంయుక్తంగా మూడవ తరగతి విద్యార్థులకు చేసిన అసిస్మేంట్ నివేదికలో కేవలం 12% మంది పిల్లలు మాత్రమే రాయడం, చదవడం చేయగలుగుతున్నారని 15% మంది పిల్లలు మాత్రమే సంఖ్యలను గుర్తిస్తున్నారని ఈ నివేదిక తెలియజేస్తుంది. జిల్లాల వారీగా చూసినట్లయితే ఇంకా కొన్ని జిల్లాలు రాష్ట్ర సగటు కంటే చాలా వెనుకబడి ఉన్నారు.
అలాగే నేషనల్ అచీవ్మెంట్ సర్వే (NAS) 2021 నివేదిక ప్రకారం 8 వ తరగతి విద్యార్థులు తెలుగులో 48% మరియు గణితంలో 32% మంది విద్యార్థులే తరగతికి తగ్గ సామర్ధ్యాలు ఉన్నాయని తెలిసింది. SC ,ST మరియు BC వర్గాల విద్యార్థులలో అభ్యసన సామర్ధ్యాలు ఇంకా ఆందోళన చెందే విధంగా ఉన్నాయి. కావున ఈ విద్యా సంక్షోభ పరిస్థితిని విద్యా ఎమర్జెన్సీగా పరిగణించాలి. ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు చేపట్టాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక మరియు తల్లుల సంఘం అధ్యర్యంలో మేమొరండము అందచెయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ జి .వేణుగోపాల్, కో కన్వీనర్ పెండం లక్ష్మిన్, జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి నారాయణ, తల్లుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ దశరథ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.