ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

 ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య 

కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనంతప్ప 

జడ్చర్ల, జూన్ 19: ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనంతప్ప తెలిపారు గురువారం జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ హైస్కూల్ ఉపాధ్యాయులు నెక్కొండ గ్రామంలో  పర్యటించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు గ్రామీణ ప్రాంతాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు భవిష్యత్తులో త్రిబుల్ ఐటీ  లో చేరడానికి 24 మార్కులు కలుపుతారని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులకు  ప్రభుత్వ పాఠశాలల మీద అవగాహన  కల్పించారు పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన ఉపాధ్యాయులు బోధించే విధానం కూలంకషంగా వివరించారు ఈ సంవత్సరం గంగాపూర్ హైస్కూల్లో 552, 523, 504 మార్కులతో పాటు 26 మంది విద్యార్థులకు 400కు పైగా మార్కులు సాధించారని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోట్ బుక్కులు, డ్రెస్సు తో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు 6000 బస్ చార్జీలు చెల్లిస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నెక్కొండ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య గౌడ్, గంగాపూర్ ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ రవి, తెలుగు లాంగ్వేజ్ పండిట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Previous Post Next Post