మహిళా సంఘ సభ్యులకు ప్రమాద బీమా

 మృతి చెందిన మహిళా సంఘ సభ్యులకు ప్రమాద బీమా మంజూరు

 నాగర్ కర్నూలు, జూన్ 25 (మనఊరు ప్రతినిధి): మున్సిపాలిటీ పరిధిలో ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు మహిళా సంఘ సభ్యులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ప్రమాద బీమా రూ.10 లక్షలు మంజూరు అయినట్లు నాగర్ కర్నూలు స్త్రీనిది మేనేజర్ పి.విక్రమ్ కుమార్ తెలిపారు. మునిసిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల గ్రామంలో ఆద్య సంఘం సభ్యురాలు కే .భాగ్య ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై మరణించగా, పట్టణానికి చెందిన చాందిని మహిళా సంఘ సభ్యురాలు అస్ర బేగం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.వారి ఇరువురికి ప్రమాద బీమా పథకం ద్వారా ప్రభుత్వం స్త్రీనిధి నుంచి ఒక్కో సభ్యురాలి కుటుంబానికి రూ.10 లక్షలు ప్రమాద బీమా మంజూరు చేసిందని అదేవిధంగా బ్యాంకు లింకేజీ,స్త్రీనిది రుణాల బకాయి నిల్వ ను కూడా మాఫీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలో వారికి ఉన్నతాధికారుల ద్వారా చెక్కులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా లోన్ బీమా పథకం లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొదటి విడతగా 20 మంది సభ్యులకు13.06లక్షలు సంఘాల పొదుపు ఖాతాలో జమ చేసిందనీ ఆయన తెలిపారు.

Previous Post Next Post