త్వరలో రాజీవ్ యువ వికాసం
హైదరాబాద్, జూన్ 25 (మనఊరు ప్రతినిధి): రాబోయే రోజుల్లో మా ముందున్న సవాలు రాజీవ్ యువ వికాసం! ప్రణాళికలు రూపొందించుకొని ప్రజల ముందుకు వస్తాం! యువతకు న్యాయం చేస్తాం! మీ ఆశీర్వాదం తీసుకుంటాం!'' అని రేవంత్రెడ్డి ఉన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 5 లక్షల మంది అర్హులను గుర్తించి.. ఆర్థిక సాయం అందించాలని, ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వానాకాలం సీజన్ రైతుభరోసా నగదు బదిలీని విజయవంతంగా పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి లక్ష్యంగా 'రాజీవ్' యువ వికాసం' నమోదు చేసుకుంది. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం స్పష్టత ఇచ్చారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. ''రైతుభరోసా పూర్తికాగానే భట్టి విక్రమార్క ఇక విరామం తీసుకుంటామని అనుకుంటున్నారు. కానీ, ఆయనకు విరామం లేదు. రాజీవ్ యువవికాసం గుర్తింపు.