పోలీస్ అధికారి బలి..

 న్యాయం చేయాలని చూస్తే.. పోలీస్ అధికారి సస్పెన్షన్

ఇల్లందు, ఎన్ఆర్ఎ తన పలుకుబడి ఉపయోగించి బంధువు అయిన ఓ పోలీస్ ఉన్నతాధికారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి కేసు విచారణ చేస్తున్న పోలీస్ అధికారిపై ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధితురాలికి న్యాయం చేసే విషయం, ఎన్ఆస్ఐ వేధింపులు, ఫిర్యాదు విషయం పక్కన పెట్టిన ఉన్నతాధికారులు విచారణ చేస్తున్న, బాధితురాలి పక్షాన నిలబడ్డ సదరు స్టేషన్ అధికారికి ఎటువంటి విచారణ లేకుండానే హుటాహుటీన సస్పెన్షన్ లెటర్ పంపడం విశేషం. భార్యాభర్తల వివాదం నేపథ్యంలో భర్త తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు ఆ లెటర్ లో పేర్కొనడం గమనార్హం.

 భార్యాభర్తల వివాదం ఓ పోలీస్ అధికారి మెడకు చుట్టుకుని ఉద్యోగం నుంచి సస్పెన్షన్ కావడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఈ వివాదంలో పోలీస్ అధికారి ప్రమేయం ఏమీ లేదని స్థానిక సిబ్బంది, బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నా.. ఎన్ఆర్ఎ తల్లిదండ్రులతో అమర్యాద ప్రవర్తించాడన్న కారణంతో ఉన్నతాధికారులు మాత్రం ఆయన పోస్టుకు ఎసరు పెట్టి సస్పెన్షన్ వేటు వేశారు. స్టేషన్ అధికారిపై వేటుతో విషయం వెలుగులోకి రాగా.. ప్రస్తుతం రెండు జిల్లాల్లో హాట్ టాపిగ్గా మారింది. భార్యాభర్తల వివాదం నేపథ్యంలో కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరినీ కలిపేందుకు ప్రయత్నం చేసినా ఉద్యోగం పోవడం ఏంటనే చర్చ కొనసాగుతోంది. ఇది భార్యాభర్తల కథ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నత సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడు అమెరికా లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా స్థిరపడ్డాడు. అతనితో పాటు అతని సోదరుడు కూడా అక్కడే ఉండటం, ఆర్థికంగా ఎదగడంతో కుటుంబ సభ్యులు పెండ్లి సంబంధాలు చూసి 2023లో మేడ్చల్ పరిధిలోని ఓ కుటుంబంలోని యువతితో వివాహం నిశ్చయించుకుని పెండ్లి చేశారు. వివాహ సమయంలో 50 తులాల బంగారం, 10 లక్షల నగదు కట్నంగా తీసుకున్నారు. అనంతరం కొద్ది కాలానికి భార్యను కూడా అమెరికాకు తీసుకెళ్లి కాపురం చేశాడు. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో కలహాలు ప్రారంభమయ్యాయి. భర్త భార్యను వేధించడం, అదనపు కట్నం తీసుకురావాలని టార్చర్ చేయడం ప్రారంభించాడు.అంతేకాదు పెండ్లి సమయంలో ఫుల్ హెయిర్ తో కనిపించిన భర్త.. తన బట్టతలను దాచి మోసం చేసినట్లు కూడా బాధిత భార్య ఆరోపిస్తుంది. వీసా రెన్యువల్ పేరిట ఇండియా పంపి..

ఈ క్రమంలో భార్యను వీసా రెన్యువల్ పేరిట అక్టోబర్ 2024 లో ఇండియా పంపిన ఎన్ఆర్ఎ భర్త..నవంబర్ లో రిటర్న్ రావాలని రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసి పంపించాడు. ఆ తర్వాత ఎన్ఆర్ఎ భర్త భార్యను పట్టించుకోకపోగా.. రిటర్న్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు. అక్టోబర్ లో హైదరాబాద్ చేరుకున్న భార్య, దాదాపు 8 నెలలుగా భర్త కోసం అత్తింటి వారిని సంప్రదిస్తూనే ఉంది. కొద్దిరోజుల క్రితం అత్తింటి ఎదుట ఆందోళన కూడా చేసింది. అత్తింటి వారు అక్కున చేర్చుకోకపోవడం, భర్త కాంటాక్ట్ లోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి వారం క్రితం జిల్లా పోలీస్ అధికారిని సంప్రదించింది. దీంతో ఆయన స్థానిక స్టేషన్ అధికారికి సమాచారం ఇస్తూ.. భార్యాభర్తలకు, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరినీ కలపాలని సూచించాడు. ఉన్నతాధికారి సూచన మేరకు బాధితురాలు స్థానిక పోలీస్ అధికారిని కలిసి విషయాన్ని విన్నవించి న్యాయం చేయాల్సిందిగా కోరింది. 

కౌన్సిలింగ్ కోసం పిలిస్తే..

పోలీసు ఉన్నతాధికారి, షీ టీం సూచనల మేరకు బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీస్ అధికారి.. ఎన్ఆర్ఎ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, బుధవారం రావాల్సిందిగా సూచించాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు ఎన్ఆర్ఎ తల్లిదండ్రులు మాత్రమే కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. సదరు స్టేషన్ అధికారి ఎస్ఆరి కొడుకు కూడా సమయం చూసుకుని రావాలని, అతనుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని సీరియస్ గానే చెప్పడంతో అమెరికాలో ఉన్న బాధితురాలి భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. 'తమ కుటుంబ సభ్యులనే స్టేషన్ కు పిలుస్తారా.. అమర్యాదగా ప్రవర్తిస్తారా' అంటూ బాధితురాలి కుటుంబ సభ్యులపై, పోలీస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

Previous Post Next Post