శ్రీశైలంలో ఉచితంగా స్పర్శ దర్శనం సామాన్య భక్తులకు

 *శ్రీశైలంలో ఉచితంగా స్పర్శ దర్శనం సామాన్య భక్తులకు*



శ్రీశైలం, జులై 1 (మనఊరు ప్రతినిధి): ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభమైంది. మంగళవారం (జులై 1) నుంచి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అధికారులు. ఉచిత స్పర్శ దర్శనం మొదటిరోజు కావడంతో మంగళవారం నాడు సుమారు 1200 మంది భక్తులను అనుమతిచ్చినట్లు తెలిపారు. అధికారులు. శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కేవలం శ్రీశైలంలో, కాశీలో మాత్రమే అందుబాటులో ఉండటం విశేషం. భక్తుల కోరిక మేరకు క్యూ లైన్ లో వచ్చే భక్తులకు ఆధార్ ద్వారా టోకెన్ జారీ చేసి ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు అధికారులు. గంటకు 600 చొప్పున సుమారు 2 గంటలు శ్రీస్వామివారి ఉచిత స్పర్శ దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. స్వామి వారి భక్తులందరూ ఉచిత స్పర్శ దర్శన సౌకర్యాన్ని వినియోగించుకొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని తెలిపారు అధికారులు. 

స్పర్శదర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం నూతన ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలిపివేస్తూ శ్రీశైలం దేవస్థానం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే.. భక్తుల విజ్ఞప్తితో దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి రద్దీ సమయాల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. రద్దీ రోజుల్లో నాలుగు విడతల్లో అలంకార దర్శనం, మూడు విడతల్లో స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే.. సర్వదర్శనం క్యూలైన్లలో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజుకు మూడు విడుతల్లో స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

Previous Post Next Post