*వైభవంగా పాలెం వెంకన్న దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు*
బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో గల శ్రీ అలర్మెల్ మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ రాఖీ పౌర్ణమి శనివారం నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా జరిగినట్లు ప్రధాన ఆలయ అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు. రాఖీ పౌర్ణమి ఉండడంతో వివిధ ప్రాంతాలకు చెందిన 36 కుటుంబాలతో సామూహికంగా వ్రతాలు చేశారని, శ్రీసత్యనారాయణ స్వామి కథ విన్న,పూజించిన,
విశేష ఫలితం ఉంటుందని అన్నారు.అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించిన వారికి ఫలితం దక్కు తుందన్నారు. భక్తులకు సంకల్పించిన కోరికలు నెరవేరుతాయి అనీ అన్నారు. కోరిన భక్తులకు ప్రతిరోజు దేవాలయం లో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయనున్నట్లు తెలిపారు.ప్రతి శనివారం భక్తులకు పాలెం బాలాజీ అన్నదాన సత్రం నందు ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేశారని మాజీ ధర్మకర్త గాడి సురేందర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో,అర్చకులు జయంత్,చక్రపాణి, ఆలయ సిబ్బంది జి.పురుషోత్తం ఎస్. బాబయ్య ,భక్తులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.