హైదరాబాద్, ఫిబ్రవరి 23 (మనఊరు న్యూస్): దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు శుభవార్త. మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 19వ విడత నిధులను విడుదల చేయనుంది. ఈ నిధులను నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అక్కడి నుంచి పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
రైతులకు భారీ ఆర్థిక మద్దతు
ప్రధాని మోడీ సర్కార్ ప్రారంభించిన పీఎం కిసాన్ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ 6వేలు ఆర్థిక సహాయం అందించారు. ఇది మూడు విడతలుగా రూ 2వేయిల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ నిధులు రైతుల ఖాతాలోకి చేరతాయి.
19వ విడతకు భారీగా నిధులు
ఇప్పటికే 18 విడతల నిధులను జమ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు 19వ విడతగా రూ 22,000 కోట్లను 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో వేయనుంది. అన్ని అవసరమైన పూర్తి ఏర్పాట్లు అధికారులు ఏర్పాటు చేశారు.
పీఎం కిసాన్ పెంచే యోచన
ప్రస్తుతం రైతులకు సంవత్సరానికి రూ 6వేలు అందజేస్తుంది, దీన్ని త్వరలోనే రూ10వేల వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ పథకం ద్వారా చిన్న రైతులకు పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని, వ్యవసాయ ఉత్పత్తి మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.