ఫ్రీగా చికెన్, ఎగ్స్..కోసం ఎగబడ్డ జనం..
జడ్చర్ల రూరల్, ఫిబ్రవరి 23 (మనఊరు న్యూస్): బర్డ్ ఫ్లూ వైరస్ లో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చికెన్ మేళాలు జడ్చర్ల పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర హుచిరీస్ నిర్వాహకులు వెంకటేష్ ఆదివారం నాడు. ఈ మేళా ఏర్పాటు చేశారు. అందులో ఫ్రీగా చికెన్, ఎగ్ ఐటెమ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ చికెన్ ప్రియులు గత కొద్ది రోజులుగా నోటికి తాళం వేశారని, బర్డ్ ఫ్లూ భయంతో కనీసం కోడిని కాదు కదా.. కోడి గుడ్డును కూడా తినడం మానేశా. అమ్మో చికెన్ తింటే ఏమవుతుందో ఏమో.. బర్డ్ ఫ్లూ వైరస్ మాకు కూడా వ్యాపిస్తుందేమో అనే అపోహలో కొందరు ఉన్నారు. అయితే ఈ విషయంపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అలాంటిదేమి జరగదని.. చికెన్, గుడ్లు తింటే ఏం కాదని అంటున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు.