కరాటేతో మానసిక దృఢత్వం లభిస్తుంది
మాజీ రాజసభ సభ్యులు టిజి వెంకటేష్
కర్నూలు, ఏప్రిల్ 12 (మనఊరు ప్రతినిధి): కరాటే నేర్చుకుంటే మానసిక, శారీరక దృఢత్వం సాధ్యం అవుతుందని మాజీ రాజసభ సభ్యులు టిజి వెంకటేష్, ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి రెన్సీ కండ్రు కీర్తన్ లు పేర్కొన్నారు. శనివారం జెకె అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పెడరేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన న్యాయ నిర్ణేతల పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన కర్నూలు జిల్లా కేంద్రంలోని చెందిన పలుకూరి జగదీష్ కుమార్ డబ్యుకేఎఫ్ జర్జి-బి కథా & కుమితే సాధించడంతో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ కరాటే అనేది ఒక యుద్ధ కళ అని నేటి కాలం లో యువకులు, యువతులు శారీరిక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం పెంపొందించుటకు ఎంతో దోహదప డుతుందన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి విద్యతోపాటు పలు రకాల యుద్ధ కళలు తదితర వాటిపై శిక్షణ ఇప్పించాలని చిన్నప్పటి నుండే పిల్లలకు మానసిక ఒత్తిళ్లకు లోను కాకుండా తోడ్పాటు అందించాలని పిల్లల తల్లిదం డ్రులకు తెలిపారు. డబ్యుకేఎఫ్ జర్జి-బి కథా & కుమితే సాధించిన జగదీష్ గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరికిషన్, గోపినాథ్, మాస్టర్లు చంద్రశేఖర్, రమణ, సయ్యద్ అశ్వక్, శ్రీనివాసులు, శ్రీదేవి, కరాటే విద్యార్థుల తల్లిదండ్రులు, కరాటే విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.