_*గాంధీ భవన్ లో ఎంపీ మల్లు రవి మీడియా సమావేశం:*
* తెలంగాణలో ప్రజల తిరుగుబాటుతోనే బిఆర్ ఎస్ ప్రభుత్వం కూలిపోయింది
* సీఎం రేవంత్ పై అక్కసు ఎందుకు కేటీఆర్
* పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ కాస్తా బంగారు కేసిఆర్ కుటుంబం గా మారింది
* ప్రతిపక్షాలు రాత్రింబవళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయి
బంగ్లాదేశ్ లో ప్రజలు తిరిగిపడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు
* పదేళ్లలో బిఆర్ఎస్ చేయనటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు
* దేశ చరిత్రలో మొదటిసారిగా పేదల కోసం సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం తీసుకొచ్చింది
* సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయం
* సమీక్షృత గురుకుల పాఠశాల లను 200 కోట్ల తో రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు
* ప్రపంచ స్థాయి విద్య , మౌలిక సదుపాయాలను రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారు
* ప్రపంచ స్థాయి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను రేవంత్ రెడ్డి , మంత్రులు బృందం తీసుకొచ్చింది
* లక్ష మంది ఉద్యోగులలో బీసీ కుల గణనను చేసి చట్ట బద్దత కల్పించారు రేవంత్ రెడ్డి గారు
* అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ తల్లి బిడ్డలే
* బంగ్లాదేశ్ తిరుగుబాటు తెలంగాణకి ఏం సంబంధం కేటీఆర్
* ధరణి తో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసింది.16 లక్షలు మంది ఇప్పడికుడ ఇబ్బంది పడుతున్నారు
* రైతులు, అధికారుల మేలు కోసం భూభారతిని సీఎం రేవంత్, మంత్రులు బృందం తీసుకొచ్చింది
* ప్రగతి భవన్ లో ప్రజలు కనపడకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు
* రేవంత్ హయంలో ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ప్రజలు వెళ్లేందుకు విలు కల్పించారు
* కాంగ్రెస్ ఏడాదిన్నర లో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం
* ప్రజాపాలన కేంద్రంగా రేవంత్ రెడ్డి పాలన