*పోయింది ప్రిన్సిపాల్ ప్యాకెట్ కాదు... మేడం పర్సు.*
---ఒక విద్యార్థి ని దొంగగా చిత్రీకరించిన ఉపాధ్యాయుడు.
-----దొంగ కాదు మంచో డే అంటున్న తోటి విద్యార్థులు.
-----గురుకుల పాఠశాల స్టాఫ్ లో సంథింగ్ సంథింగ్..?
కొందుర్గు, ఏప్రిల్ 17 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ లను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యా వ్యవస్థను నడిపిస్తున్న నేటి కాలంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులు బలి అవుతున్న విద్యార్థులు. కొందుర్గు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో నిన్న బుధవారం నాడు ఇంగ్లీష్ పై లిట్రసి ప్రోగ్రాం లైబ్రరీ హాల్లో నిర్వహించారు. ఈ ప్రోగ్రాం పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందం గ్రూపులను సందర్శించింది. పాఠశాలలో ప్రోగ్రామ్ నిర్వహించారు. ఆ లైబ్రేరియన్ టీచర్ మౌనిక తన పర్స్ హాల్లో మర్చిపోయింది. తదనంతరం ప్రోగ్రాం నిర్వహించిన మరో స్వాతి ఉపాధ్యాయురాలు ఆ రూమ్ యొక్క తాళం చేతులు తొమ్మిదో తరగతి విద్యార్థి దినేష్ కు ఇవ్వడం జరిగింది. ఆ విద్యార్థితో పాటు మరెందరో విద్యార్థులు ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. పరుసు పోయిందని ఆ తొమ్మిదవ తరగతి విద్యార్థి పై అపనింద వేయడంతో ఆ విద్యార్థి మానసికంగా మనోవేదనకు గురిచేసి వార్షిక పరీక్ష రాయనివ్వకుండా హౌస్ మాస్టర్ విజయ్ మోహన్, ఉపాధ్యాయురాలు స్వాతి, పనిష్మెంట్ క్రింద పాఠశాల బయట కూర్చోబెట్టారు. పరీక్ష రాయని విద్యార్థి ఇతరుల ఫోన్తో తమ బాబాయికి సమాచారం అందివ్వడంతో ఈ బండారమంతా బయటపడింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా గంట నర ఆలస్యంగా ఏడుస్తున్న విద్యార్థితో పరీక్ష ప్రిన్సిపాల్ సమక్షంలో రాయించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల శ్రేయస్సు కోరే విధంగా పని చేయాలి కానీ. వారి వస్తువులు వారి జాగ్రత్తగా చూసు కోకుండా విద్యార్థులపై నెట్టి వారి భవిష్యత్తుకు కారణం కాకూడదు అని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి సంఘటనలు పునావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.