అంజనీకుమారికి జాతీయ స్వర్ణనంది అవార్డు బహూకరణ
హైదరాబాద్, ఏప్రిల్ 17 (మనఊరు ప్రతినిధి): శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ వారు ఉగాది జాతీయ స్వర్ణ నంది పురస్కారం పివిపి అంజనీ కుమారికి ప్రదానం చేశారు. వీరు అద్భుతమైన సమాజ సేవ చేస్తారు. విద్యార్థులకు కూడా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేపడతారు. అద్వితీయమైన ఆమె సేవలను గుర్తించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంజనీ కుమారికిఈ అవార్డు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం హైదరాబాదులోని త్యాగరాయ గాన సభ ప్రధాన వేదికలో అంగరంగ వైభవంగా జరిగినది. విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ అధినేత జి కృష్ణ సాహిత్య సేవ, సాంస్కృతిక రంగాలలో అలాగే సమాజ సేవలో తమ వంతు కృషి చేస్తున్న వారికి జాతీయ స్వర్ణ నంది అవార్డులను ప్రకటించడం జరిగింది. అవార్డ్స్ తీసుకున్న వారిలో ప్రముఖ కవయిత్రి ముక్తేవి భారతికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నృత్య గురువు డాక్టర్. ఏలేశ్వరపు చలపతి శాస్త్రికి జీవన సాఫల్య జాతీయ స్వర్ణ నంది అవార్డును బహూకరించారు. అలాగే జాతీయ స్వర్ణ నంది అవార్డును నెల్లూరు వాసి, ఉత్తమ ఉపాధ్యాయురాలు సమాజ సేవకురాలు కామంచి శారద హిందీ పండిట్ కి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు, సినీ గేయ రచయిత, కవయిత్రి హైదరాబాదుకు చెందిన రమాదేవి బుక్కపట్నంకి సాహిత్య సేవలో భాగంగా, అలాగే కూచిపూడి నాట్య గురువులు కళ్యాణి భవ్యసాయికి, శేష భట్నాకర్ రంజిత చార్యకి శ్వేతకి, వసుమతి పరకాలకి, శైలజ వడ్డాణంకి, మిస్టర్ విజువల మహంతి నాయుడుకి, మిస్టర్ ఉప్పల పవన్ రాజ్ కి, సామాజికవేత్త ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం కు చెందిన గ్రంధి కృష్ణమూర్తికి ఈ అవార్డులను బహూకరించడం జరిగినది. శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ అధినేత జి .కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పు సత్యనారాయణ, విశిష్ట, ఆత్మీయ అతిథులుగా దైవజ్ఞశర్మ, డైరెక్టర్ ఆఫ్ కథక్ మహారాజ్ అంజిబాబు, కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మొదలైన వారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా ముఖ్యంగా అంజనీకుమారి మాట్లాడుతూ ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా బాధ్యతలను పెంచింది. సమాజ సేవలో మమ్ములను మేము మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి గొప్ప వైన అవార్డ్స్ ఇవ్వడము నేటి సమాజానికి చాలా అవసరము. ఈ జాతీయ స్వర్ణనంది అవార్డు శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ వారు వరుసగా రెండోసారి ఇచ్చినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని అన్నారు.