ధర్మపురి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై విషప్రయోగం..
సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఆదిలాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన
ఆదిలాబాద్, ఏప్రిల్ 16 (మనఊరు ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వారి ధర్మపురిలోని ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో గుర్తుతెలియని దుండగులు పురుగుల మందు కలిపారు. ట్యాంక్తో పాటు మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగుల మందు చల్లారు. ఈ సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన గ్రామంలో అందరినీ షాక్కు గురిచేసింది. కాగా ఈ విషప్రయోగం ఘటనపై పోలీసులకు హెచ్ఎం ప్రతిభ ఫిర్యాదు చేశారు. ఈ పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. సిబ్బంది గమనించకుంటే విద్యార్థుల పరిస్థితి ఏంటంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.