*వట్టెం ఆరోగ్య ఉప కేంద్రం ఆకస్మికతనిఖీ...*
బిజినపల్లి, ఏప్రిల్ 16 (మనఊరు ప్రతినిధి): బిజినపల్లి మండల పరిధిలోని వట్టెం ఆరోగ్యప కేంద్రాన్ని జిల్లా టీకాల అధికారి డాక్టర్ కే రవి కుమార్ నాయక్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన విధంగా 12 రకాల వ్యాధి నిరోధక టీకాలు చిన్నపిల్లలకు తప్పనిసరిగా వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు తామర, మహిళా ఆరోగ్య కార్యకర్త మీనా కుమారి, సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.