బీసీ రిజర్వేషన్ పితామహుడు బిందే శ్వరి ప్రసాద్
జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 13 (మనఊరు ప్రతినిధి): బిందే శ్వరి ప్రసాద్ మండల్ 43వ వర్ధంతిని పురస్కరించుకొని మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ఆయనచిత్రపటానికి పూలమాలలువేసినివాళులర్పించిన బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుపల్లి కృష్ణ యాదవ్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయక్, Aidm వ్యవస్థాపక జాతీయ పకీర్ జాంగిర్ పాషా, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పార్టీ జిల్లా అధ్యక్షులు బాగి కృష్ణయ్య సామాజికవేత, వడ్లని శేఖర్ యాదవ్,,. బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, 1979లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించాలన్న ఆదేశంతోభారత పార్లమెంటేరియన్ బి.పి.మండల్ ను రెండవ వెనకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గా నియమించార ని తెలిపారు. రిజర్వేషన్ల కోటాలు ఏర్పరిచడమనే లక్ష్యాన్ని, సాంఘిక, ఆర్థిక, విద్యాపరమైన సూచికల ఆధారంగా వెనుకబాటు కు గురైన ప్రజల జీవనస్థితిగతులను అధ్యయనం చేయడానికి బిందేశ్వరి ప్రసాద్ మండల్ నేతృత్వం వహించి కులం, ఆర్థిక, సామాజిక పరి మితులను ఆధారం చేసుకుని 1980 నాటికి భారతదేశ జనాభాలో 52 శాతం ప్రజలను ఓబీసీ ("ఇతర వెనుకబడ్డ కులాలు") లుగా గుర్తించిఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లోనూ 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమీషన్ 40 సిఫారసులతో కూడిన నివేదికను 1980లో అప్పటి రాష్ట్రపతికి అందజేశారని తెలిపారు. కమిషన్ నివేదిక ఆధారంగానే 1993 నుండి బీసీలకు విద్యా ఉద్యోగాల్లో, 2008 నుండి విద్యారంగంలో 27శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. మిగతా సిఫారసులను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేసివిద్య,ఉద్యోగాలతో పాటు ఉపాధి, ఆర్థిక, రాజకీయరంగంలో,
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని
కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ జాగృతి సేన నాయకులు, బొల్లెమోని నిరంజన్, గొడుగు నర్సిములు, గోపాల్, శివరాములు, వెంకటేష్, చెన్నయ్య, గోనెల రాధాకృష్ణ, రంగయ్య మహారాజ్, జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.