నాణ్యమైన విద్యను అందించడం న్యూ మాస్టర్ మైండ్స్ కళాశాల లక్ష్యం

 నాణ్యమైన విద్యను అందించడం న్యూ మాస్టర్ మైండ్స్ కళాశాల లక్ష్యం

అచ్చంపేట జూనియర్ కళాశాల బ్రాంచ్ ఇంటింటి ప్రచారం

  బ్రాంచ్ డైరెక్టర్ సనాతన రమాదేవి 



అచ్చంపేట, ఏప్రిల్ 13 (మనఊరు ప్రతినిధి): విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం న్యూ మాస్టర్ మైండ్స్ కళాశాల లక్ష్యం మని అచ్చంపేట బ్రాంచ్ డైరెక్టర్ సనాతన రమాదేవి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని లింగాల మండలంలోని అప్పయ్యపల్లి గ్రామంలో న్యూ మాస్టర్ మైండ్స్ అచ్చంపేట బ్రాంచ్ డైరెక్టర్ డైరెక్టర్ సనాతన రమాదేవి ఇంటింటికి వెళ్లి పాంప్లెంట్ తో ప్రచారం చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో న్యూ మాస్టర్ మైండ్స్ జూనియర్ కళాశాల నూతన ఉరవడిని సృష్టిస్తుందని తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించాలని ఉద్దేశంతో న్యూ మాస్టర్ మైండ్స్ జూనియర్ కళాశాలను అచ్చంపేటలో ఏర్పాటు చేసినట్లు సనాతన రమాదేవి పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కలిసి న్యూ మాస్టర్ మైండ్స్ జూనియర్ కళాశాలపై అవగాహన కల్పించి అడ్మిషన్లను ప్రారంభించారు. విధార్థిని విద్యార్థులకు బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు, బాయ్స్ కు, బాలికలకు సపరేటు తరగతులు, ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ క్లాసులు నిర్వహిస్తామని, వారానికి ఒకసారి వీక్లీ టెస్టులతో పాటు నెలకు గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తామని, కంప్యూటర్ పై శిక్షణ ఇస్తూ ఆన్ లైన్ టెస్టులు వ్రాయిస్తామని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎప్పుడు ముందుంటుందన్నారు. మంచి రుచికరమైన భోజనాన్ని హాస్టల్ ద్వారా విదార్థులకు అందిస్తామని, అల్లాదకరమైన వాతావరణంలో కాలేజీ క్యాంపస్ ఉంటుందని బ్రాంచ్ డైరెక్టర్ సనాతన రమాదేవి తెలిపారు. అడ్మిషన్ కోసం సెల్ నెంబర్ ను 9390137817 సంప్రదించాల్సిందిగా కోరారు.

Previous Post Next Post