ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలి
జెకె ట్రస్ట్ చైర్మన్ వి. నరసింహచారి
దేవాలయల పునర్నిర్మాణము కోసం 15వేల ఆర్థిక సాయం
నవాబుపేట, మే 20 (మనఊరు ప్రతినిధి): ప్రతి ఒక్కరూ విధిగా దైవభక్తిని అలవర్చుకోవాలని, తద్వారా సమాజశాంతి నెలకొంటుందని జెకె ట్రస్ట్ చైర్మన్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వి. నరసింహచారి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో జోగు లక్ష్మయ్య వ్యవసాయ పొలములో పురాతన గుళ్ళు శ్రీశ్రీశ్రీ మైసమ్మ దేవత, శ్రీశ్రీశ్రీ భూ లక్ష్మమ్మ దేవత పునర్నిర్మాణము కొరసం జెకె కుటుంబ ట్రస్టు ఆధ్వర్యంలో రూ 15వేలు ఆర్థిక సహాయము అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొనాలంటే విధిగా భగవంతుడ్ని ఆరాధించాలన్నారు. తాము సర్వమతాలను గౌరవిస్తామని, కులమతాలకతీతంగా పేదలకడగండ్లు తీర్చుతున్నట్టు తెలిపారు. నిత్యం భగవంతునికి సేవలందించాలని ఆయన సూచించారు. మండల కేంద్రం అభివృద్ధి చేసేందుకోసం అధ్యక్షులు వి.నరసింహచారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.