ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి
శ్రీ బ్రహ్మశ్రీ కాకోజు పాండురంగస్వామి
బిజనపల్లి, జూన్ 20 (మనఊరు ప్రతినిధి): ఉరుకులు, పరుగుల జీవన విధానంలో ఒత్తిడికి గురవుతున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని శ్రీ బ్రహ్మశ్రీ కాకోజు పాండురంగస్వామి అన్నారు. శుక్రవారం వారి లట్టుపల్లిలోని గండి చెరువు గుట్టపై వెలసిన శ్రీ శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 11వ వార్షికోత్సవం సందర్భంగా గణపతి పూజ, నవగ్రహ పూజ, పుణ్యహవాచనం, స్వామి వారికి అభిషేకం, సకలదేవత హోమం అంకురార్పణం, కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ బ్రహ్మశ్రీ కాకోజు పాండురంగస్వామి దంపతులకు పాదపూజ తరువాత నాగపూరి, నాగరాజు, నాగేశ్వరి దంపతులు హైదరాబాద్, చీర్ల బీముడుసాగర్ లక్ష్మీ దంపతులు అన్న ప్రసాద దాతలు వెంకటేష్ సాగర్ భవ్యశ్రీ రవి సాగర్ హైదరాబాద్ వాసులు11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'గురు దక్షిణ'గా 'పాద పూజ' చేశారు. అర్చక పరివారం, వేద పండితులు మంత్రం చదివి వినిపించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని. ఈ సందర్భంగా పాండురంగ స్వామి మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకు అందించే బాధ్యత మనందరిపై చర్చ. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ సప్త భజన మండలి భక్తి గీతాలు, లట్టుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి మహిళలు కొళాటాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు, భక్తులు ఉన్నారు.