రాజ్ భవన్ లో చోరీ...

 రాజ్ భవన్ లో చోరీ...

హైదరాబాద్, మే 20 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ ఘటన చోటుచేసుకుంది. అందులోని సుధర్మ భవన్ లోని నాలుగు హార్డ్ డిస్కులు చోరీ అయినట్లు రాజ్ భవన్ అధికారులు గుర్తించారు. 

ఈ నెల 13న చోరీ ఘటన చోటుచేసుకోగా.. పంజాగుట్ట పోలీసులకు రాజ్ భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ చోరీకి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. అతడిని రిమాండ్కు తరలించారు.

Previous Post Next Post