*ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*
*మెడికల్ సూపరింటెండెంట్ ఆర్. రఘు.*
నాగర్ కర్నూల్, జూన్ 2 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించినట్లు ప్రభుత్వ సాధరణ ఆస్పత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ ఆర్. రఘు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గతంలో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య సేవలు మెరుగ్గా ఈ ప్రాంతప్రజలకు అందుతున్నాయని అన్నారు. గతంలో కరోనా వచ్చిన సమయంలో కూడా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ప్రజలకు అందుబాటులోని వైద్య సేవలు అందించిన సేవలు మరువలేమని,వారి కృషి అభినందనీయమని అన్నారు.జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ సీట్ల కేటాయింపు ఉండాలని పలువురు వైద్యులు కోరారు. ఈ కార్యక్రమంలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ సివిల్ సర్జన్ డాక్టర్ రవి శంకర్ నాయక్, ప్రొఫెసర్లు డాక్టర్ శేఖర్, డాక్టర్ సూర్యనారాయణ, ఆర్.ఏం.ఓ. వైద్యులు డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ అజీమ్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రోహిత్ వివిధ విభాగాల వైద్య ప్రొఫెసర్లు,అసిస్టెంట్ ప్రొఫెసర్లు ,హెడ్ నర్సులు, నర్సింగ్ ఆఫీసర్లు,ఆసుపత్రి మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.