ఆర్ టీ సీ బస్టాండ్ ను వినియోగములోకి తేవాలని నిరాహార దిక్ష

 *ఆర్ టీ సీ బస్టాండ్ ను వినియోగములోకి తేవాలని నిరాహార దిక్ష*

*పెంట్లవెల్లి బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు సంపూర్ణ మద్దతు*


పెంట్లవెల్లి, జూన్ 1 (మనఊరు ప్రతినిధి): పెంట్లవెల్లి మండలం కేంద్రంలోని ఆర్ టీ సీ బస్టాండ్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని సామాజిక కార్యకర్త మూలే మేఘరాజు ఆదివారం రోజు నిర్వహించిన నిరాహార దీక్షకు బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు సంపూర్ణ మద్దతు తెలిపారు. దీక్ష శిబిరాన్ని ఉదేశ్యంచి ఆయన మాట్లాడుతూ మా నాయకుడు కేటీఆర్ అన్నట్లు మాకు అధికారం ముఖ్యం కాదు, మాకు ముందు గ్రామ అభివృద్ధి ముఖ్యమన్నారు. ఆర్ టీ సీ బస్టాండ్ నిర్మించి దాదాపు 28 సంవత్సరాల నుంచి ఓక బస్ కూడా నేటి వరకు వెళ్ళలేదు అంటే ఆర్ టీ సీ అధికారులు ఎంత మొద్దు నిద్రలో ఉన్నారో అని ఆయన ఎదవ చేశారు. ఇప్పటికైనా ఆర్ టీ సీ అధికారులు స్పందించి రహదారికి ముందు వరసలో ఉన్న డబ్బాలను తొలిగించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలిని డిమాండ్ చేశారు. పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేసుకునే వారికే షాపులు కేటాయించాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

Previous Post Next Post