విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

 విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి 

వాసవి క్లబ్ అధ్యక్షులు చిత్తనూరి రామకృష్ణ 






జడ్చర్ల రూరల్, జూన్ 20 (మనఊరు ప్రతినిధి): విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని వాసవి క్లబ్ అధ్యక్షులు చిత్తనూరి రామకృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులకు మొమెంటులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఐపిఈ పరీక్షల్లో ఉత్తమమైన ఫలితాలు కనబరిచి జిల్లాలోనే అత్యధికంగా 80శాతం ఉత్తీర్ణత చెందిన కళాశాలను అభినందించారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలకు దీటుగా 1000కి 950 నుంచి 986 మార్కులు సాధించిన 14 మంది విద్యార్థులకు వారి కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి వారికి మొమెంటు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రాధ, వాసవి క్లబ్ నాయకులు మేడిశెట్టి రామకృష్ణ, గుడిపల్లి ప్రవీణ్ కుమార్, కండె కృష్ణ, కోశాధికారి హెచ్ఎం నవీన్, దిలీప్, మంచన గణేష్, మహేష్ బాదం రఘు, విద్యాసాగర్, జయప్రకాశ్, కోదండ రామయ్య మరియు ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post