ఎన్.పి.సి.ఆర్ – బాలల హక్కుల కోసం ఏర్పడిన ఎన్జీవోల నెట్వర్క్ సంభోగం
హైదరాబాద్, జూన్ 12 (మనఊరు ప్రతినిధి): "నెట్వర్క్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NPCR)" అనేది సుమారు 25 పైగా సమాన దృక్పథం కలిగిన ఎన్జీవోలు కలసి ఏర్పడిన ఈ నెట్వర్క్ గత 15 సంవత్సరాలుగా కార్మిక శాఖతో నిరంతరం కలిసి పని చేస్తూ పిల్లలు పని చేస్తున్న ప్రాంతాలలో రైల్వే ప్లాట్ ఫామ్ మీద ఉన్నపిల్లల కోసం, డొమెస్టిక్ వర్కర్స్గా పనిచేసే బాలల కోసం, హోటళ్లలో, షాపుల్లో, కార్ల గ్యారేజీల్లో పనిచేస్తున్న చిన్నారుల కోసం బహుళ కార్యక్రమాలు నిర్వహిస్తూ, కార్మిక శాఖతో కలిసి సమన్వయంగా పనిచేస్తోంది.
ఈ నెట్వర్క్ లక్ష్యం –
బాల కార్మికులను గుర్తించడం, విముక్తి కల్పించడం, పునఃసమీకరణ చేయడం, పిల్లలను మళ్లీ పాఠశాల బాటలోకి తిప్పడం. ఈ లక్ష్యంతో మేము: ఎన్నో రైడింగ్, రెస్క్యూ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. పిల్లలు పని చేయకూడదన్న స్పష్టమైన సందేశాన్ని సమాజానికి పంపించాం. ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేస్తూ వాస్తవ మార్పును తీసుకువచ్చాం. ఈ ఉద్యమం ఎంతో విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికీ కొనసాగుతుంది. భవిష్యత్తులో కార్మిక శాఖ సహాయంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ, తెలంగాణను బాల కార్మికుల లేని రాష్ట్రంగా మార్చేందుకు మేము కట్టుబడినవారం. పిల్లల హక్కులకు, వారి భవిష్యత్తుకు మా ఉద్యమం కొనసాగుతుంది. పిల్లలను బడిబాట పట్టించేందుకు ఆశయంతో మా పోరాటం నిరంతరం కోన సాగుతుంది. ఈ కార్యక్రమంలో Mss. జాయింట్ కమిషనర్ ఎంఎస్ఎస్ సంధ్యా, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ కౌంట్రీ కన్వీనర్ వెంకటరెడ్డి, ఎన్ జిఓలు కోవా మజుర్ హుస్సేన్, ఫిలిప్స్ దివ్య, దిశర్మోనీ, స్వామి. ఎంవీఫ్ బస్వరాజ్, ప్రోగ్రాం.. మేనేజర్ మాస్ స్వచ్చంద సంస్థ అధ్యాక్షురాలు లక్ష్మికాంతమ్మ, ఖమ్మం జానవికాస్ సొసైటీ.. చంద్రశేకర్ ప్రసాద్, తెలంగాణ టియుజెఏసి ప్రఫుల్ రామిరెడ్డి, అభ్యుదయ ఎడ్యుకేషన్. సొసైటీ, అశోక్ అమన్. వేదిక. అనురాధ.. అంబిక అక్షర ఆంజనేలు రైతుస్వరాజ్య వేదిక కే. రవి ధనలక్ష్మి, కుర్మయ్య, సుజ్జి సుచరిత. విద్యార్థులు. మహిళలు. పాల్గొని కార్యక్రమం. విజయ వంతం చేశారు.