అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్యను పెంచండి

 అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్యను పెంచండి

జిల్లా సంక్షేమాధికారిణి రాజేశ్వరి






నాగర్ కర్నూల్, జూన్ 12 (మనఊరు ప్రతినిధి): అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెరగాలని, అందుకు టీచర్లు, ఆయాలు కృషి చేయాలని మహిళా, శిశు, దివ్యాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమాధికారిణి రాజేశ్వరి సూచించారు. గురువారం "బడి బాట" కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో 'అమ్మ మాట అంగన్వాడీ బాట' కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి కె. రాజేశ్వరి గారు నాగనూల్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలల్లో ఆరేండ్ల లోపు వయసు పిల్లలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాలకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఇపుడున్న పిల్లల కంటే 30 శాతం సంఖ్య పెంచాలని ఆదేశించారు. అంతకు ముందు అంగన్వాడీ కేంద్రంలోని రికార్డులు తనిఖీ చేశారు. పిల్లల హాజరు శాతాన్ని చూడటం జరిగింది. పిల్లల సంఖ్యను పెంచేందుకు గ్రామంలో అవగాహన పెంచాలని అంగన్వాడీ టీచర్ కు సూచించారు. అంగన్వాడీ 'కేంద్రంలో ఒక పూట సంపూర్ణ భోజనం అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన "అంగన్వాడీ కేంద్రంలో ఎగ్ బిర్యాని" ని ఏర్పాటును చూడటం జరిగింది. అలాగే న్యూట్రి గార్డెన్ కోసం కూరగాయలు మొక్కలు నాటడం జరిగింది. ప్రతి రోజు అంగన్వాడీ కేంద్రంలో పండించిన కూరగాయలతో లబ్దిదారులకు రుచికరమైన నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం సమయానికి వండి పెట్టాలని అలాగే టేక్ హోం రేషన్ లబ్దిదారులకు అందించాలని అందించాలని సూచించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపివొ సంగీత, సూపర్ వైజర్ కృష్ణవేణి, అంగన్వాడీ టేచర్లు సంజీవమ్మ, సుశీల పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొనటం జరిగింది.

Previous Post Next Post