ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వరం

 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వరం 

మరికల్ పాఠశాల హెచ్ఎం సర్వమంగళ


చౌడాపూర్, జూన్ 12 (మనఊరు ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు వరం లాంటిదని జడ్పిహెచ్ఎస్ మరికల్ పాఠశాల హెచ్ఎం సర్వమంగళ అన్నారు. గురువారం మండలంలోని మరికల్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నూతనంగా 16 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూని ఫారాలు, మధ్యాహ్న భోజనం వారానికి మూడు రోజులు గుడ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు చక్కగా బోధన చేస్తారని విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, కాపీలు ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తామని.మంచి పోషకాలతో మధ్యాహ్న భోజనం ఉంటుంది కనుక అందరిని మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి డబ్బులు హృదా చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ అంజమ్మ, ఉపాధ్యాయులు సరస్వతి, విజయలక్ష్మి, మళ్లప్ప, శైలజ, మల్లయ్య, రామక్రిష్ణ, హన్మయ్య పాండు రంగయ్యచారి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post