సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం
టాస్క్ సిఒఒ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
కల్వకుర్తి, జూన్ 1 (మనఊరు ప్రతినిధి): ముఖ్య మంత్రి సహాయ ని ధి నిరుపేదలకు వ రం లాటిందని టాస్క్ సిఒఒ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని వెల్దండ,ఆమనగల్, కల్వకుర్తి, తలకొండపల్లి, కడ్తల్ మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.6,66,500ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్ ల పంపిణీ కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటనలో బాగంగా వెల్దండలోని ఆయన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఆసుపత్రిలో చేరిన వారికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోని ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్దిదారులు ముఖ్యమంత్రికి, సుంకిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. సిఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తమకు ఆర్థికంగా అండగా ఉంటూ,ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక కష్టాల్లో తమను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు పంతుల నాయక్, నరేందర్ గౌడ్, సీనియర్ నాయకులు వెంకట్ నాయక్, శ్రీనునాయక్, కొండల్ యాదవ్, రమేష్ నాయక్, లక్ష్మణ్, తరుణ్ స్వామి, కృష్ణ యాదవ్ లతో పాటు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.