*వడ్డేమాన్ లో కమ్యూనిటీ సానిటేషన్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ*
బిజినపల్లి, జూన్ 21 (మనఊరు ప్రతినిధి): స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్ నిర్మాణమునకు భూమి పూజను శనివారం నాడు బిజినపల్లి మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీ శనేశ్వర దేవాలయం ప్రాంగణంలో అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారీ రాజేశ్వరి భూమిపూజా చేశారు. ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా రెండు లక్షల పదివేలు రూపాయలు మరియు గ్రామపంచాయతీ ద్వారా 90 వేల రూపాయలు మొత్తం 3మూడు లక్షల రూపాయల ద్వారా ప్రజా ఉపయోగానికి, ఆరోగ్య జీవితానికి కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్ నిర్మించడం జరుగుతుందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమానికీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థనుండి కే. రాజేష్ కుమార్, కోఆర్డినేటర్ ఉషన్నా, బిజినపల్లి మండల అభివృద్ధి అధికారి కథలప్ప, అదనపు కార్యక్రమ అధికారి మల్లికార్జున్, ఈసీరామ్మోహన్ రెడ్డి, సాంకేతిక, క్షేత్ర, సహాయకులు రాజు,దేవదాస్ ఆలయ ప్రధాన పూజారి డాక్టర్ గవ్వమటం విశ్వనాథ శాస్త్రి, శాంత కుమార్, కమిటీ సభ్యులు ప్రభాకర్ఆచారి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.