విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి...
జిల్లా పోలీస్ బృందం
మహబూబ్ నగర్, జూన్ 25 (మనఊరు ప్రతినిధి): విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదవాలని పోలీసులు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ శాఖ సౌజన్యంతో సురక్ష పోలీస్ కళాబృందం వారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోడుగల్ హెచ్ఎం మారేపల్లి శ్రీనివాసులు అధ్యక్షతన విద్యార్థులకు సామాజిక అవగాహన కార్యక్రమం జరిగింది. మాదకద్రవ్యాల నిరోధక చట్టం, వివిధ చట్టాల ప్రాముఖ్యత, సెల్ఫోన్ వినియోగం, సైబర్ క్రైమ్, క్రమశిక్షణ, భవిష్యత్ లక్ష్యాలపై ముఖ్య అంశాలను వివరించారు. విద్యార్థుల చట్టాలను గౌరవించడం, మాదకద్రవ్యాల నుండి దూరంగా ఉండటం, సెల్ఫోన్లను సక్రమంగా వినియోగించడం, సైబర్ మోసాల నుండి రక్షణ పొందే విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్రమశిక్షణ కలిగిన విద్యార్థులకే మంచి భవిష్యత్తు ఉంటుందని పోలీసులు తెలియజేశారు. విద్యార్థులు సరైన నిర్ణయాలు తీసుకుని, ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా శ్రద్ధ వహించాలని సూచించారు. ఏఎస్ఐ విష్ణు, పోలీస్ కళాబృందం రాములు, వరప్రసాద్, జగదీష్, శివరాములు, బాల్ రాజ్, కృష్ణయ్య, ఉపాధ్యాయులు షహీనా పర్వీన్, కృష్ణయ్య, అమరేందర్ రెడ్డి, ఉమాదేవి, స్లీవారెడ్డి, శశిధర్, అనసూయ, కర్ణాకర్, గోవర్ధన్, శ్రీనివాసులుశెట్టి, ఆంజనేయులు, మల్లికార్జున్, కృష్ణ, అంజలీదేవి, తాహేర్, రవికుమార్, అశోక్, స్ఫూర్తి, లావణ్య, విద్యార్థులు, తర్వాత.