రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంకు సీఎం సలహాదారు రాక
రంగారెడ్డి, కలెక్టరేట్, జూన్ 1 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఉదయం 9గంటలకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, కొంగరకలాన్ నిర్వహింస్తున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నాట్లు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కెఎల్ఆర్) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహేశ్వరం నియోజకవర్గం పార్టీ శ్రేణులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరారు.